తెలంగాణపై మోడీ వ్యాఖ్యలు: రాజ్యసభను బహిష్కరించిన టీఆర్ఎస్

Published : Feb 10, 2022, 11:14 AM IST
తెలంగాణపై మోడీ వ్యాఖ్యలు: రాజ్యసభను బహిష్కరించిన టీఆర్ఎస్

సారాంశం

తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు గురువారం నాడు రాజ్యసభను బహిష్కరించారు.


తెన్యూఢిల్లీ: Telanganaపై ప్రధాని Narendra Modiవ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు గురువారం నాడు Rajaya Sabhaను బహిష్కరించారు.  తెలంగాణను కించపర్చేలా మోడీ వ్యాఖ్యలు చేశారని TRS మండిపడుతుంది.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వతేదీన రాజ్యసభలో ప్రసంగించారు. ఇందులో భాగంగానే Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ  ప్రసంగించారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే  ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు. 

Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి ఆయన గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్న కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చాయన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేశారు. విభజన వ్యవహరం ఎలా జరిగిందనేది కీలకమన్నారు. Parliament లో మైకులు కట్ చేసి తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని మోడీ ప్రశ్నించారు. మీ అహంకారంతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు గతంలో తాము ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మమయంలో శాంతియుత వాతావరణం ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేసుకొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో  ఈ తరహ చర్యలు తీసుకోలేదన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతుంది. మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం నాడు రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరసనలను దిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.

తెలంగాణపై మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది.అయితే మోడీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు సమర్ధిస్తున్నారు. కాంగ్రెస్ ను మోడీ విమర్శిస్తే టీఆర్ఎస్ ఎందుకు భుజాలు తడుముకొంటుందో అర్ధం కావడం లేదన్నారు. విబజన జరిగిన తీరును మోడీ ప్రశ్నించారని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు.

తెలంగాణపై మోడీకి ఉన్న అక్కసు ఈ వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మోడీ ఎప్పుడు మాట్లాడినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మోడీ వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన తెలంగాణ నేతలు ఏం సమాధానం చెబుతారని టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మోడీ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో  ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దానికి తెరతీశాయి.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Pressmeet: తుగ్లక్ పరిపాలన చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu
Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?