రాజాసింగ్‌పై ట్రాన్స్‌జెండర్ పోటీ...

Published : Nov 20, 2018, 04:58 PM ISTUpdated : Nov 20, 2018, 05:19 PM IST
రాజాసింగ్‌పై ట్రాన్స్‌జెండర్ పోటీ...

సారాంశం

హైదరాబాద్‌లో బిజెపి తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఓ ట్రాన్స్ జెండర్ పోటీకి దిగింది. సీపిఎం నేతృత్వంలోని బహుజన లెప్ట్ ఫ్రంట్ టికెట్ పై చంద్రముఖి అనే ట్రాన్స్ జెండర్ ను గోషామహల్ నుండి బరిలోకి దింపింది. దీంతో ఇప్పటికే ఇక్కడ బిజెపి తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ల మధ్య రసవత్తర పోటీ ఖాయమైన నేపథ్యంలో ఈమె రాకతో గోషామహల్ పై మరింత ఆసక్తి పెరిగింది.   

హైదరాబాద్‌లో బిజెపి తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఓ ట్రాన్స్ జెండర్ పోటీకి దిగింది. సీపిఎం నేతృత్వంలోని బహుజన లెప్ట్ ఫ్రంట్ టికెట్ పై చంద్రముఖి అనే ట్రాన్స్ జెండర్ ను గోషామహల్ నుండి బరిలోకి దింపింది. దీంతో ఇప్పటికే ఇక్కడ బిజెపి తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ల మధ్య రసవత్తర పోటీ ఖాయమైన నేపథ్యంలో ఈమె రాకతో గోషామహల్ పై మరింత ఆసక్తి పెరిగింది. 

తనకు ఈ ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని అన్ని ముఖ్య పార్టీలని కోరినట్లు చంద్రముఖి(32) తెలిపారు. అయితే అందరు తిరస్కరించినా చివరకు బీఎల్ఎఫ్ తనకు అవకాశం కల్పించిందన్నారు. బీఎల్ఎఫ్ భీపారంపై ఆమె నామినేషన్ వేసినట్లు తెలిపిన ఆమె...ఈ  అవకాశం కల్పించిన సీపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలుపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని చంద్రముఖి తెలిపారు.

గోషామహల్ లో అధికంగా ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వ్యాపారవేత్తలే ఉన్నారని...వారికి ట్రాన్స్ జెండర్స్ సమస్యల గురించి తెలుసని అన్నారు. కాబట్టి వారందరు తనకే  ఓటేస్తారని భావిస్తున్నట్లు చంద్రముఖి తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ట్రాన్స్ జెండర్స్ సమస్యలతో పాటు బాల కార్మిక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.    

సంబంధిత వార్తలు

గోషామహల్ లో ట్రాన్స్ జెండర్ చంద్రముఖి ప్రచారం (ఫొటోలు)

గోషామహాల్ నుండి ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి బరిలోకి
 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం హాజరైన వెంకయ్య నాయుడు| Asianet News Telugu
KA Paul Pressmeet: తెలంగాణని నాశనం చేయడానికి కవిత కొత్త పార్టీ పెట్టింది: కేఏ పాల్| Asianet Telugu