మూడేళ్ల తర్వాత సన్‌డే ఫన్‌డే... ట్యాంక్‌బండ్‌పై రేపు ట్రాఫిక్ ఆంక్షలు

Siva Kodati |  
Published : Aug 13, 2022, 07:44 PM IST
మూడేళ్ల తర్వాత సన్‌డే ఫన్‌డే... ట్యాంక్‌బండ్‌పై రేపు ట్రాఫిక్ ఆంక్షలు

సారాంశం

కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన సన్ డే ఫన్ డే కార్యక్రమం దాదాపు మూడేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు ట్యాంక్ బండ్‌పై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.   

రేపు ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్ డే కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు నగరవాసులను కోరారు. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన సన్ డే ఫన్ డే కార్యక్రమం దాదాపు మూడేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమవుతోంది. ట్యాంక్ బండ్ సందర్శకుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేస్తున్నారు. ఈ సమయంలో కేవలం పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. వాహనాలకు అనుమతి ఉండదు. అయితే కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్