
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వకారం చేసిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నగరానికి ఇవాళ వస్తున్నారు. ఆయన రాక సందర్భంగా నేడు, రేపు (సోమ, మంగళ వారాల్లో) హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
21న ఉదయం 10.45 గంటల నుంచి 11.30 గంటల వరకు బేగంపేట ఎయిర్ పోర్టు, పీఎన్టీ జంక్షన్, శ్యాంలాల్బిల్డింగ్, హెచ్పీఎస్, బేగంపేట ఫ్లై ఓవర్, గ్రీన్ల్యాండ్ జంక్షన్, మోనప్ప ఐ లాండ్, ఎంఎంటీఎస్, రాజ్భవన్ రైల్వే గేట్, వీవీ విగ్రహం మార్గాల్లో వెళ్లే వాహనాలను వివిధ మార్గాల్లో మళ్లిస్తారు. 22వ ఉ. 7.15 నుంచి 8 గంటల వరకు రాజ్భవన్, యశోద ఆస్పత్రి, మోనప్ప ఐ లాండ్, ఎంఎంటీఎస్, గ్రీన్ల్యాండ్ జంక్షన్, బేగంపేట ఎయిర్పోర్టు దారుల్లో వెళ్లే వాహనాలను మళ్లిస్తారు. నగర ప్రజలు ఈ విషయంలో సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
తెలుగు జాతికి చెందిన వ్యక్తి, ఆంధ్రా నేత ఉపరాష్ట్రపతి గా ఎన్నికైన నేపథ్యంలో తెలంగాణ సర్కారు వెంకయ్యనాయుడుకు పౌర సన్మానం ఏర్పాటు చేసింది. రాజ్ భవన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ పౌర సన్మానం విషయంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ సర్కారు పత్రికల్లో ప్రముఖంగా వాణిజ్య ప్రకటనలు విడుదల చేసింది.