చెప్పుల దండ వేయిస్తా: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Jul 4, 2021, 1:26 PM IST
Highlights

మీరు చెప్పులతో కొట్టుడు కాదు, మీకు చెప్పుల దండ వేయిస్తానని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


హైదరాబాద్: మీరు చెప్పులతో కొట్టుడు కాదు, మీకు చెప్పుల దండ వేయిస్తానని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆయన ఫైర్ అయ్యారు.  పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రద్దైన వెయ్యి రూపాయాల నోట్ల లాంటి వాళ్లన్నారు. చీము నెత్తురు ఉంటే ఎమ్మెల్యే పదవుకుల రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు.  గ్రామాల్లోకి వస్తే తమ పార్టీ కార్యకర్తలు తరిమికొడతారని ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.చీము నెత్తురుంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని ఆయన కోరారు. ఈ నెల 7వ తేదీ తర్వాత తాట తీయిస్తానని ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలను హెచ్చరించారు.

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇటీవల నియమించింది. ఈ నెల 7వ తేదీన పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించనున్నారు. రేవంత్ రెడ్డికి ఈ పదవిని కట్టబెట్టడాన్ని కొందరు పార్టీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 

click me!