కొమరంభీమ్ జిల్లాలో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

Published : Nov 13, 2020, 12:32 PM ISTUpdated : Nov 13, 2020, 01:06 PM IST
కొమరంభీమ్ జిల్లాలో  విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

సారాంశం

కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు.  


ఆసిఫాబాద్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు.

జిల్లాలోని చింతలమానపల్లి మండలం బూరపల్లిలో విషాదం చోటు చేసుకొంది. ప్రాణహిత నదిలో భార్య, కూతురు ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయం తెలుసుకొన్న భర్త కూడ ఇదే నదిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలిసిన మృతుల బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఏ విషయమై గొడవ జరిగిందనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మృతదేహాల కోసం ప్రాణహిత నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను దొరికిన వెంటనే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు