మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

Published : Jun 21, 2022, 12:50 PM ISTUpdated : Jun 21, 2022, 12:56 PM IST
మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

సారాంశం

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. డోర్నకల్‌ మండలం అందనాలపాడులో గుడిలో మైక్ సెట్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతిచెందారు. 

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. గుడిలో మైక్ సెట్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతిచెందారు. వివరాలు.. డోర్నకల్‌ మండలం అందనాలపాడులో రామాలయానికి మైక్ సెట్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులను సుబ్బారావు, మస్తాన్‌రావు, వెంకయ్యలుగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారుమైకులు కడుతున్న పైపు ఇనుపది కావడం వలనే విద్యుత్ షాక్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 

ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

రాములోరి కళ్యాణం వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు | Asianet News Telugu
Jobs : తెలుగు యువత బీ రెడీ... ఏకంగా 68,150 ఉద్యోగాలు వచ్చేస్తున్నాయ్..!