రంగారెడ్డి జిల్లా సోలీపూర్‌లో విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి..

Published : Sep 26, 2022, 11:16 AM IST
రంగారెడ్డి జిల్లా సోలీపూర్‌లో విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి..

సారాంశం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండల పరిధిలోని సోలీపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. 

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండల పరిధిలోని సోలీపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులను అక్షిత్ గౌడ్, ఫరీద్, పర్వీన్‌గా గుర్తించారు. ముగ్గురు చిన్నారులు కూడా పదేళ్లలోపు వయసు గలవారే. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో నుంచి ముగ్గురు చిన్నారుల మృతదేహాలను గ్రామస్థులు వెలికితీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Rain Alert : తెలుగు ప్రజలారా ఊపిరి పీల్చుకొండి.. ఇక వర్షాలు షురూ కాబోతున్నాయి, ఎప్పట్నుంచో తెలుసా?
Telangana Niagara: తెలంగాణలో నయాగరా జలపాతం.. వీకెండ్ ట్రిప్ కోసం బెస్ట్ ప్లేస్.. రూట్ మ్యాప్, ఫుల్ డీటెయిల్స్ ఇవే !