హైద్రాబాద్ స్కూల్‌లో ర్యాగింగ్: విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Published : Jul 08, 2019, 04:25 PM IST
హైద్రాబాద్ స్కూల్‌లో ర్యాగింగ్: విద్యార్థి ఆత్మహత్యాయత్నం

సారాంశం

తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక పదోతరగతి విద్యార్థి రవికిరణ్  సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్:తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక పదోతరగతి విద్యార్థి రవికిరణ్  సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

హైద్రాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో రవికిరణ్ 10వ తరగతి చదువుతున్నాడు. రవికిరణ్‌ గ్రీన్ పార్క్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.తోటి విద్యార్థులు రవి కిరణ్ ను డబ్బులు తేవాలని వేధించారు. దీంతో  తల్లిదండ్రులకు తెలియకుండా రూ. 6 వేలను రవికిరణ్ తోటి విద్యార్థులకు ఇచ్చాడు.

మళ్లీ డబ్బులు ఇవ్వాలని రవికిరణ్‌ను  విద్యార్థులు వేధించారు. దీంతో రవికిరణ్  ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ పట్టించుకోలేదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

దీంతో రవికిరణ్ సూసైడ్ నోటు రాసి పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు రవికిరణ్‌ను ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సి అందిస్తున్నారు. ఈ విషయమై బాధితుడి కుటుంబసభ్యులు  పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్
IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ