ఎఫ్ఆర్‌వోపై దాడి: మళ్లీ మొక్కలు నాటేందుకు సిద్ధమైన అటవీశాఖ

Siva Kodati |  
Published : Jul 01, 2019, 09:16 AM IST
ఎఫ్ఆర్‌వోపై దాడి: మళ్లీ మొక్కలు నాటేందుకు సిద్ధమైన అటవీశాఖ

సారాంశం

అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జడ్పీ వైఎస్ ఛైర్మన్ కోనేరు కృష్ణ దాడి చేయడంతో కొమరం భీం జిల్లాలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి.

అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జడ్పీ వైఎస్ ఛైర్మన్ కోనేరు కృష్ణ దాడి చేయడంతో కొమరం భీం జిల్లాలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. అటవీశాఖ అధికారుల తీరుకు నిరసనగా సోమవారం ఎమ్మెల్యే అనుచరులు తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్షకు దిగనున్నారు.

నిన్న దాడి జరిగిన ప్రదేశంలో అటవీశాఖ అధికారులు ఇవాళ మొక్కలు నాటేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లోనే ఐజీ నాగిరెడ్డి మకాం వేసి పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu