నిజామాబాద్‌ ధర్పల్లిలో టెన్షన్ టెన్షన్.. టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఎస్సైకి గాయాలు..

Published : Feb 19, 2022, 11:35 AM IST
నిజామాబాద్‌ ధర్పల్లిలో టెన్షన్ టెన్షన్.. టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఎస్సైకి గాయాలు..

సారాంశం

నిజామాబాద్ జిల్లాలో ధర్పల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగాయి. దీంతో పరిస్థితులును అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించిన ఎస్సైకి గాయాలు అయ్యాయి.   

నిజామాబాద్ జిల్లాలో ధర్పల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసకుంది. ధర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ధర్పల్లికి వచ్చేందుకు సిద్దమయ్యారు. అయితే ఎంపీ అరవింద్ రాకను నిరసిస్తూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టడంపై బీజేపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు పరిస్థితులు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ర్యాలీకి పర్మిషన్ లేదని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎస్సైకి గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ సభలో జీవన్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Jeevan Reddy Powerful Speech | BRS Jagtial Meeting
Hyderabad : ఐఏఎస్, ఐపిఎస్ లే కుళ్లుకునేలా.. ఓ ఛాయ్ హోటల్ ఉద్యోగికి నెెలకు రూ.5 లక్షల జీతమే..!!