Telangana: బెట్టింగ్ యాప్ లకు వ్యతిరేకంగా ఇతను ఏం చేశాడో చూడండి

Published : May 06, 2025, 10:34 AM IST
Telangana: బెట్టింగ్ యాప్ లకు వ్యతిరేకంగా ఇతను ఏం చేశాడో చూడండి

సారాంశం

మత్తు పదార్థాలు,బెట్టింగ్‌ యాప్‌ లకు వ్యతిరేకంగా ఇప్పటికే యూట్యూబర్‌ అన్వేష్‌ పోరాటం చేస్తున్నాడు. అతనికి తోడుగాతెలంగాణకు చెందిన యశ్వంత్‌ అనే యువపర్వతారోహకుడు మౌంట్‌ ఐసో పర్వతాన్ని అధిరోహించాడు.

ఇంఫాల్: మత్తుమందుల వాడకం, బెట్టింగ్ యాప్‌లపై అవగాహన పెంచాలనే  ఉద్దేశంతో తెలంగాణకు చెందిన 20 ఏళ్ల యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మణిపూర్ రాష్ట్రంలోని ఎత్తైన శిఖరం మౌంట్ ఐసో ను విజయవంతంగా అధిరోహించాడు. ఈ శిఖరం సెనాపతి జిల్లాలో ఉంది.డిగ్రీ చదువుతున్న యశ్వంత్, గత 10 రోజుల్లో త్రిపురాలోని ఎత్తైన శిఖరం బెట్లింగ్‌చిప్ (తైడౌర్), అరుణాచల్ ప్రదేశ్‌లోని మౌంట్ గోరిచెన్ ,  మణిపూర్‌లోని మౌంట్ ఐసోలతో కలిపి మూడు రాష్ట్రాల ఎత్తైన శిఖరాలను అధిరోహించాడు.

వారి సహకారం మరిచిపోలేనిది

ఈ సాధనల వెనుక ఉన్న కారణం గురించి యశ్వంత్ PTIతో మాట్లాడుతూ, "దేశవ్యాప్తంగా వేలాది మంది బెట్టింగ్ యాప్‌లకు బానిసలవుతూ తమ శ్రమఫలితాన్ని కోల్పోతున్నారు. అలాగే మత్తుమందుల ప్రభావం కూడా పెరుగుతోంది. నా పర్వతారోహణ పట్ల ఉన్న ఆసక్తిని ఈ సామాజిక సందేశంతో మిళితం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను" అని చెప్పారు.మౌంట్ ఐసో ఎక్కే సమయంలో యశ్వంత్‌కు అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు అధికారుల మద్దతు లభించింది. "వారి ఉనికి, సహకారం, స్నేహభావం వల్ల ఈ ఎడిషన్ మరింత మరిచిపోలేని అనుభవంగా మారింది" అని ఆయన అన్నారు.

"ప్రతి రాష్ట్రంలో ఉన్న ఎత్తైన శిఖరాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడమే నా లక్ష్యం. దీన్ని 'హర్ శిఖర్ పర తిరంగా' ఉద్యమంగా తీసుకుంటున్నాను" అని తెలిపారు. మౌంట్ ఐసో దాదాపు 3000 మీటర్ల ఎత్తులో ఉండటంతో అది అధిరోహించడం సవాలుగా మారిందని, చలిగా ఉన్నా శరీరం వేడెక్కిన తర్వాత అధిరోహణ బాగా సాగిందని చెప్పారు.యశ్వంత్ తన తదుపరి గమ్యస్థానంగా మిజోరాంను ఎంచుకున్నారు. మంగళవారం అక్కడి ఎత్తైన శిఖరాలను అధిరోహించనున్నారు. త్వరలోనే ఈశాన్య భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించే యోచనలో ఉన్నారు.

16ఏళ్ల వయసులోనే పర్వతారోహణ ప్రారంభించిన యశ్వంత్, 2021లో ఆఫ్రికాలోని ప్రసిద్ధ మౌంట్ కిలిమంజారోను కూడా అధిరోహించిన అనుభవం కలిగినవారు"ప్రతి శిఖరారోహణ ఒక త్రివర్ణ పతాకానికి, భారత భూమికి  అంకితం. ఆరోగ్యాన్ని, నైతికతను, దిశానిర్దేశిత జీవితాన్ని ఎంచుకోండి. వ్యక్తిగతంగా, కుటుంబంగా మనల్ని నాశనం చేసే దురాచారాలను నివారిద్దాం" అని యశ్వంత్ తన సందేశాన్ని ముగించాడు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu