తెలంగాణ యూనివర్శిటీ వీసీ రవీందర్ పై ఏసీబీ విచారణ: పాలకమండలి కీలక నిర్ణయం

Published : Apr 27, 2023, 10:37 AM IST
తెలంగాణ యూనివర్శిటీ  వీసీ   రవీందర్ పై  ఏసీబీ విచారణ: పాలకమండలి కీలక నిర్ణయం

సారాంశం

తెలంగాణ యూనివర్శిటీ  వీసీ రవీందర్ పై  ఏసీబీ  విచారణ నిర్వహించాలని   పాలకమండలి  నిర్ణయం తీసుకుంది.  

నిజామాబాద్:తెలంగాణ  యూనివర్శిటీ  వీసీ  రవీందర్ పై  ఏసీబీ  విచారణకు   పాలకమండలి  తీర్మానం  చేసింది.  అయితే  ఈ సమావేశానికి  వీసీ రవీందర్ హాజరు కాలేదు.  ఈ సమావేశంలో  పలు  కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనమతులు లేకుండానే  నిధులను ఖర్చు చేయడాన్ని  సమావేశం తప్పుబట్టింది.   ఇంచార్జీ  రిజిస్ట్రార్  గా ఉన్న ప్రొఫెసర్ విద్యావర్ధినిపై  చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు  ఇంచార్జీ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాలపై   విచారించాలని  కూడా ఈ సమావేశం  తీర్మానం చేసింది. 

అకాడమిక్ కన్సల్టెంట్ శ్రీనివాస్ ను విధుల నుండి తొలగించాలని  తీర్మానం  చేసింది.  బుధవారంనాడు  హైద్రాబాద్ లో  తెలంగాణ యూనివర్శిటీ పాలకమండలి సమావేశం  జరిగింది.  విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ,  కాలేజీ  విద్య కమిషనర్  నవీన్ మిట్టల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.  మరో వైపు  తెలంగాణ  యూనివర్శిటీ  కొత్త వీసీగా బాధ్యతలు చేపట్టిన యాదగిరి  తాను తీసుకున్న నిర్ణయాలను  పాలకమండలి ముందుంచారు.  తెలంగాణ యూనివర్శిటీ  లో  నిధుల దుర్వినియోగంపై  కూడా  ఈ సమావేశంలో  చర్చించారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ