తెలంగాణలో 208 కరోనా కేసులు: మొత్తం కేసులు 6,95,780కి చేరిక

By narsimha lodeFirst Published Sep 20, 2021, 8:59 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 208 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత చర్యలు తీసుకొంటుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 208 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 45,274 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 208 మంది కరోనా కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 6,95,780కి చేరుకొన్నాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,906కి చేరింది. నిన్న ఒక్క రోజే 220 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో 4,991 కరోనా కేసులున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి పెరగకుండా  కేసీఆర్ సర్కార్ అన్ని చర్యలు తీసుకొంటుంది. కరోనా కేసుల వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ ను కూడ మరింత వేగవంతం  చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ డ్రైవ్ ను చేపట్టింది.తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి తగ్గినందునే విద్యా సంస్థలను తెరిచింది ప్రభుత్వం.

 

click me!