ఒమిక్రాన్‌పై తెలంగాణ సర్కార్ అలెర్ట్:ప్రైమరీ కాంటాక్టులకు వైద్య పరీక్షలు

Published : Dec 16, 2021, 11:16 AM IST
ఒమిక్రాన్‌పై తెలంగాణ సర్కార్ అలెర్ట్:ప్రైమరీ కాంటాక్టులకు వైద్య పరీక్షలు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.ఒమిక్రాన్ సోకిన వారి కాంటాక్టులను సేకరించి కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ  వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నాయి.

హైదరాబాద్:హైదరాబాద్‌‌లో రెండు Omicronకేసులు నమోదు కావడంతో Telangana వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒమిక్రాన్ సోకిన ఇద్దరితో ప్రైమరీ కాంటాక్టులు పొందిన వారి సమాచారాన్ని Health ఆరోగ్య శాఖాధికారులు  సేకరించారు. కెన్యా నుండి వచ్చిన మహిళతో పాటు సోమాలియా నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ Srinivasa Rao ప్రకటించారు.ఈ ఇద్దరితో ప్రైమరీ కాంటాక్టుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖాధికారులు సేకరించారు. ఒమిక్రాన్ సోకిన ఇద్దరిని హైద్రాబాద్ టిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఇద్దరి ప్రైమరీ కాంటాక్టులో 136 మంది ఉన్నారని  గుర్తించారు. వీరికి కరోనా RTPCR పరీక్షలు నిర్వహిస్తున్నారు.  వీరిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కు పంపనున్నారు.

Hyderabad బంజారాహిల్స్‌లో పారామౌంట్ కాలనీలో వైద్య ఆరోగ్య శాఖాధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమాలియా నుండి వచ్చిన వ్యక్తి  ఎక్కడెక్కడికి తిరిగాడు... ఆయన ఎవరెవరిని కలిశారో ట్రేస్ చేసి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పారమౌంట్ కాలనీలో ఇవాళ మరికొందరికి పరీక్షలు చేస్తున్నారు. 40 మంది వైద్య సిబ్బందితో పారామౌంట్ అపార్ట్ మెంట్ లో   పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఫలితాలు 48 గంటల్లో రానున్నాయి.హైద్రాబాద్ నగరంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విదేశాల నుండి వచ్చే  ప్రయాణీలకు పరీక్షలు తప్పనిసరి చేశారు.

కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరికి  ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టుగా  తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు బుధశారం నాడు ప్రకటించారు.అందులో ఒకరు 24 ఏళ్ల మహిళని.. ఆమె కెన్యానుంచి ఈ నెల 12న తెలంగాణకు వచ్చారని చెప్పారు. ఆ యువతి టోలిచౌకిలో ఉన్నట్టు గుర్తించామన్నారు. ఆమె ఇంట్లోని ఇద్దరిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారని తెలిపారు. వారి శాంపిల్స్‌ను ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కు పంపించినట్టుగా వెల్లడించారు. యువతిని ప్రస్తుతం గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించినట్టుగా చెప్పారు. 

also read:తెలంగాణ : 24 గంటల్లో 186 మందికి పాజిటివ్.. 6,78,874కి చేరిన కేసుల సంఖ్య

రెండో వ్యక్తి సోమాలియా నుంచి వచ్చిన 23 ఏళ్ల వ్యక్తి అని  శ్రీనివాస్ రావు తెలిపారు. నాన్ రిస్క్‌ కంట్రీ నుంచి రావడంతో.. పరీక్షలు నిర్వహించి ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లేందుకు అనుమతించినట్టుగా తెలిపారు. ఇతను కూడా టోలిచౌకి ప్రాంతంలో ఉంటున్నట్టుగా చెప్పారు. అతన్ని ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. మరోకరికి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయిందని.. అతడు 7 ఏళ్ల బాలుడని తెలిపారు. బాలుడి స్వస్థలం బెంగాల్‌ అని.. రాష్ట్రంలోకి రాలేదని వెల్లడించారు. అతడు విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి.. కోల్‌కతాకు వెళ్లినట్టుగా చెప్పారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ వైద్యారోగ్య శాఖకు తెలియజేయడం జరిగిందని చెప్పారు. బాధితుల్లో పెద్దగా లక్షణాలు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ, హైదరాబాద్‌లోని స్థానికులకు ఎక్కడా ఒమిక్రాన్ సోకలేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు ఉన్నట్టుగా వెల్లడించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం