పరిషత్ ఎన్నికల్లో అధికారుల తప్పిదం: రెండు సార్లు ఓటేసిన ఓటర్లు

Siva Kodati |  
Published : May 07, 2019, 11:49 AM IST
పరిషత్ ఎన్నికల్లో అధికారుల తప్పిదం: రెండు సార్లు ఓటేసిన ఓటర్లు

సారాంశం

తెలంగాణ తొలి దశ పరిషత్ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్‌లో ప్రజలు రెండు సార్లు ఓటేశారు. నవీపేట్ పోలింగ్ కేంద్రానికి నాలేశ్వర్ గ్రామానికి చెందిన బ్యాలెట్ పేపర్లు వచ్చాయి.

తెలంగాణ తొలి దశ పరిషత్ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్‌లో ప్రజలు రెండు సార్లు ఓటేశారు. నవీపేట్ పోలింగ్ కేంద్రానికి నాలేశ్వర్ గ్రామానికి చెందిన బ్యాలెట్ పేపర్లు వచ్చాయి.

ఇది గమనించిన అధికారులు వాటిపైనే ఓటు వేయించారు. అయితే వెంటనే బ్యాలెట్ పత్రాలు తారుమారైనట్లు గుర్తించిన అధికారులు ఒక ఓటరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి పొరపాటు వెలుగులోకి వచ్చింది. దీంతో అంతకు ముందు ఓటు హక్కు వినియోగించుకున్న వారిని మరోసారి వెనక్కి పిలిచి ఓటు వేయించారు అధికారులు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్
Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్