తెలంగాణలో కేసీఆర్ సైన్యం, దేనికైనా సిద్దమే: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలనం

By narsimha lodeFirst Published Jan 5, 2023, 2:58 PM IST
Highlights

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  మంత్రి పదవులు చెప్పుకోవడానికే ఉండేవని  తెలంగాణ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  చెప్పారు.   

హైదరాబాద్ :తెలంగాణలో  సీఎం  కేసీఆర్ కు   సైన్యం ఉందని రాష్ట్ర స్పోర్ట్స్ శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.గురువారంనాడు మంత్రి   మీడియాతో మాట్లాడారు.   కేసీఆర్ సైన్యం చావడానికైనా, చంపడానికైనా సిద్దమేనని చెప్పారు.  జాతీయ రాజకీయాల్లోకి  కేసీఆర్ ను రాకుండా అడ్డుకొనే  ప్రయత్నం చేస్తున్నారని  శ్రీనివాస్ గౌడ్  ఆరోపించారు. ఎవరి బెదిరింపులకు తాము భయపడబోమని  మంత్రి శ్రీనివాస్ గౌడ్  చెప్పారు.అన్ని అంశాలపై పట్టున్నవారికే  కేసీఆర్ సీఎం పదవులు అప్పగించారన్నారు. 

2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  శ్రీనివాస్ గౌడ్  రెండో దఫా విజయం సాధించారు.  కేసీఆర్ మంత్రివర్గంలో  శ్రీనివాస్ గౌడ్  కు  కేసీఆర్ మంత్రిపదవిని కేటాయించారు. తెలంగాణ ఉద్యమంలో  ఉద్యోగాల సంఘం నేతగా శ్రీనివాస్ గౌడ్  కీలకంగా వ్యవహరించారు.  2014లో  తొలిసారిగా మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన  అసెంబ్లీలో అడుగు పెట్టారు.  2018లో  ఆయన రెండోసారి అదే స్థానం  నుండి విజయం సాధించారు.  

2014 ఎన్నికల్లో వనపర్తి నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసిన   నిరంజన్ రెడ్డి ఓటమి పాలు కావడంతో  జిల్లా నుండి  జడ్చర్ల నుండి విజయం సాధించిన డాక్టర్ లక్ష్మారెడ్డికి మంత్రి పదవి దక్కింది.  2018 ఎన్నికల్లో లక్ష్మారెడ్డికి కేసీఆర్ మంత్రి పదవిని ఇవ్వలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి  నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లకు  మంత్రి పదవులను  కేసీఆర్ కేటాయించారు. 

click me!