మంత్రి జగదీశ్వర్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

Published : Apr 09, 2017, 10:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
మంత్రి జగదీశ్వర్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

సారాంశం

కాన్వాయ్ లోని కారు ఢీకొనడంతో ముగ్గిరికి గాయాలు

రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ను మరో కారు ఢీకొట్టింది.

 

నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ఐటీపాముల వద్ద ఈ రోజు ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని కారే మంత్రి కారును ఢీకొట్టడంతో రెండు కార్లు స్వలంగా దెబ్బతిన్నాయి.

 

జగదీశ్వర్‌ రెడ్డి ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే కాన్వాయలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Union Budget లో వైజాగ్ ప్రస్తావనే లేదు.. అయినా ఈ నగరానికి మహర్దశ, ఎలాగో తెలుసా..?
కోఠిలో కాల్పులు, లక్షల రూపాయల చోరీ | Koti Firing & Robbery | KTR Reaction | Asianet News Telugu