తెలంగాణ మంత్రి అల్లుడుకి బీఆర్ఎస్ మల్కాజిగిరి టికెట్.. !

Published : Sep 28, 2023, 10:20 AM IST
తెలంగాణ మంత్రి అల్లుడుకి బీఆర్ఎస్ మల్కాజిగిరి టికెట్.. !

సారాంశం

Hyderabad: తెలంగాణ మంత్రి అల్లుడికి మల్కాజిగిరి టికెట్ ద‌క్క‌నుంద‌ని అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కుల‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాలు టాక్ న‌డుస్తోంది. మెదక్ నియోజకవర్గం నుంచి తన కుమారుడు రోహిత్ రావుకు టికెట్ ఇవ్వాలన్న ఆయన డిమాండ్ వినకపోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గత వారం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. దీంతో మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ ఎవ‌రిని బ‌రిలోకి దింప‌నుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.   

Malkajgiri Assembly constituency: తెలంగాణ మంత్రి అల్లుడికి మల్కాజిగిరి టికెట్ ద‌క్క‌నుంద‌ని అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కుల‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాలు టాక్ న‌డుస్తోంది. మెదక్ నియోజకవర్గం నుంచి తన కుమారుడు రోహిత్ రావుకు టికెట్ ఇవ్వాలన్న ఆయన డిమాండ్ వినకపోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గత వారం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. దీంతో మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ ఎవ‌రిని బ‌రిలోకి దింప‌నుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వివ‌రాల్లోకెళ్తే... కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్నార‌ని స‌మాచారం. గులాబీ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ మద్దతుదారులతో కలిసి వీరిద్దరూ నిర్వహించిన బలప్రదర్శన కార్యక్రమంలో మల్లారెడ్డి ఆయ‌న అభ్యర్థిత్వాన్ని ధృవీకరించారు. ఈ నెల 28వ తేదీ గురువారం మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్ నుంచి రాజశేఖర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న ఈ మెగా ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొంటారు. ప్రస్తుతం రాజశేఖర్ మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి తన కుమారుడు రోహిత్ రావుకు టికెట్ కేటాయించకపోవడంపై తనకు, పార్టీ నాయకత్వానికి మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గతవారం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ స‌భ‌ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయం సాధించారు. మల్కాజిగిరి సహా 115 అసెంబ్లీ స్థానాలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో టిక్కెట్టు ద‌క్క‌ని నేత‌లు ప‌లువురు ఇప్ప‌టికే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేసిన తర్వాత పార్టీ సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోందని, రాజశేఖర్ రెడ్డి పేరును ఖరారు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu