కృష్ణా జలాలు 50:50 నిష్పత్తిలో పంచండి: కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ లేఖ

Siva Kodati |  
Published : Jul 20, 2021, 09:01 PM IST
కృష్ణా జలాలు 50:50 నిష్పత్తిలో పంచండి: కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ లేఖ

సారాంశం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ మంగళవారం లేఖ రాశారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లోని జనాభా ఆధారంగా నీటి పంపకాలు జరపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ రాశారు. కృష్ణా బేసిన్‌లోని నీటిని తెలంగాణ, ఏపీకి 50:50 నిష్పత్తిలో కేటాయించాలని లేఖలో కోరారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంత వరకు 50 శాతం కేటాయించాలని ఈఎన్‌సీ విజ్ఞప్తి చేశారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల జనాభా ఆధారంగా పంపకాలు జరపాలని తెలంగాణ సర్కార్ కోరుతోంది. క్యాచ్మెంట్ ఏరియా లెక్కన తెలంగాణకు 70.8 శాతం, ఏపీకి 29.2 శాతం నీటి పంపకాలు చేయాలని విజ్ఞప్తి చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Rain Alert: ఇక షురూ.. తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు తప్పవు
School Bandh: విద్యార్థులకు ఊహించని సెలవు.. జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బంద్