ఎట్టకేలకు వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి కేటీఆర్

By Siva KodatiFirst Published Jul 20, 2021, 7:49 PM IST
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీకృష్ణ, నర్సు జ్యోతిలతో పాటు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.   

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ మేరకు వ్యాక్సిన్‌ తీసుకుంటున్న ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలై చాలా కాలమైనా కేటీఆర్‌ టీకా తీసుకోలేదు. ఇదే సమయంలో ఆయన కరోనా బారినపడగా, టీకా తీసుకోవడం మరింత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీకా తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీకృష్ణ, నర్సు జ్యోతిలతో పాటు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.  

 

Got my first jab today

Thank you Dr. Sree Krishna, Nurse Kerina Jyothi and all the healthcare workers who have been terrific 🙏 pic.twitter.com/ZjrYq1f3tY

— KTR (@KTRTRS)
click me!