జీహెచ్ఎంసీ ఎన్నికలు: హైకోర్టు కీలక సూచనలు.. అక్కడ రీపోలింగ్ తప్పదా..?

Siva Kodati |  
Published : Dec 03, 2020, 08:20 PM ISTUpdated : Dec 03, 2020, 08:58 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: హైకోర్టు కీలక సూచనలు.. అక్కడ రీపోలింగ్ తప్పదా..?

సారాంశం

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈసీకి కీలక సూచన చేసింది. ఝాన్సీ బజార్‌, పురానాపూల్‌ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) సూచించింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈసీకి కీలక సూచన చేసింది. ఘాన్సీ బజార్‌, పురానాపూల్‌ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) సూచించింది.

ఝాన్సీ బజార్‌, పురానాపూల్‌ డివిజన్లలో రీపోలింగ్‌ నిర్వహించాలని అక్కడి బీజేపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ రెండు డివిజన్లలో ఎంఐఎం పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది.

దీంతో రీపోలింగ్‌ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఈసీకి సూచించింది. అయితే రేపే ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో ఈ అంశం మీద ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy: వంట చేసి విద్యార్థులతో కలిసి తిన్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
CM Revanth Reddy Inaugurates Telangana Public School | Breakfast Scheme Launched | Asianet Telugu