తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రారంభం

Published : Oct 16, 2022, 12:28 PM IST
తెలంగాణలో గ్రూప్ -1  ప్రిలిమ్స్  పరీక్షలు ప్రారంభం

సారాంశం

తెలంగాణలోగ్రూప్ 1 ప్రిలిమినరీ  పరీక్షలు ఆదివారంనాడు ప్రారంభమయ్యాయి.503 పోస్టులకు గాను  పరీక్షలు నిర్వహిస్తుంది టీఎస్‌పీఎస్‌సీ.3.90లక్షల మందిఈ పరీక్షల కోసం ధరఖాస్తు  చేసుకున్నారు.  

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

రాష్ట్రంలోని 503 పోస్టులను భర్తీ చేసేందుకు  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తుంది.ఉదయం 10:15 గంటలు దాటిన తర్వాత  పరీక్ష కేంద్రంలోకి అభ్యర్ధులను అమనుతించలేదు.ఈ  పరీక్షకు 3.90లక్షల మంది ధరఖాస్తు  చేసుకున్నారు.గ్రూప్ 1 పరీక్షల కోసం 1019    పరీక్షా కేంద్రాలను ఏర్పాటు  చేశారు.  503 గ్రూప్ 1  పోస్టులకుగాను 2,28,809 పురుషులు,1,51,228 మహిళ అభ్యర్ధులు ధరఖాస్తు  చేసుకున్నారు.

44మందిట్రాన్స్ జెండర్లు కూడ గ్రూప్ 1 పరీక్షల కోసం ధరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిగ్రూప్ 1 నోటిఫికేషన్ ఇది.ఏపీ  ప్రభుత్వం 2011లో 312 గ్రూప్ పోస్టులకునోటిఫికేషన్  జారీ చేసింది.గ్రూప్ 1  పరీక్షల్లో  రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసిన విషయం తెలిసిందే.తెలుగు ,ఇంగ్లీష్,ఉర్ధూ భాషల్లో  ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 121  ఎండీఓ,91డీఎస్పీ,48 కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు,42 డిప్యూటీ కలెక్టర్లు,41మున్సిపల్ కమిషనర్లు, 40 అసిస్టెంట్  ఆడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu