Telangana మహిళా సంఘాలకు సర్కార్ అదిరిపోయే శుభవార్త..నేరుగా రూ. 10 లక్షలు..!

Published : Jun 06, 2025, 08:27 AM IST
Money Horoscope

సారాంశం

తెలంగాణలో స్వయం సహాయక బృంద సభ్యుల ప్రమాద మరణాలపై ప్రభుత్వమే నేరుగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పటికే 385 కుటుంబాలకు రూ.38.5 కోట్లు మంజూరు అయ్యాయి.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం చేపడుతున్న పథకాలలో భాగంగా, మహిళా సంఘాలకు ఆర్థికంగా మరింత బలం చేకూర్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన స్వయం సహాయక బృందాల సభ్యుల కుటుంబాలకు బీమా సంస్థల ద్వారా సహాయం అందించేది. అయితే ఈ ప్రక్రియలో వచ్చే ఆలస్యం, జటిలతను తొలగించేందుకు, ఇకపై ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది.

రూ.10 లక్షల పరిహారం నేరుగా

ఇందులో భాగంగా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సభ్యుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల నష్ట పరిహారం నేరుగా చెల్లించనుంది. ఈ విధానం వల్ల బీమా దరఖాస్తు ప్రక్రియ, డాక్యుమెంటేషన్ వంటి సమస్యలు లేకుండా వెంటనే ఆర్థిక సాయం అందే అవకాశం ఉంటుంది.

రూ.38.5 కోట్లను..

గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 385 మంది స్వయం సహాయక బృంద సభ్యులు ప్రమాదవశాత్తు మరణించారు. వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.38.5 కోట్లను విడుదల చేయాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. త్వరలోనే ఈ మొత్తం లబ్ధిదారులకు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ చర్యతో మహిళా బృందాల కుటుంబాలకు ఆపత్కాలంలో భరోసా లభించనుండగా, ప్రభుత్వ నిబద్ధత స్పష్టమవుతోంది. అంతేగాక, ఈ విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించేందుకు ప్రభుత్వ ప్రణాళిక సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?