మేడిగడ్డ బ్యారేజీ ఘ‌ట‌న‌పై విచారణ ప్రారంభించిన తెలంగాణ స‌ర్కారు, ఎల్ అండ్ టీ

Published : Oct 24, 2023, 12:00 PM ISTUpdated : Oct 24, 2023, 12:28 PM IST
మేడిగడ్డ బ్యారేజీ ఘ‌ట‌న‌పై విచారణ ప్రారంభించిన తెలంగాణ స‌ర్కారు, ఎల్ అండ్ టీ

సారాంశం

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ 6వ బ్లాక్‌ కింద 20వ పిల్లర్‌ అడుగుల వరకు కూలిపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం సాయంత్రం బ్యారేజీ సమీపంలో పెద్ద శబ్ధం రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై విచారణ చేపట్టామన్నారు. బ్యారేజీలో నీరు ఉన్నందున ఇప్పుడేమీ చెప్పలేమనీ, పూర్తిస్థాయిలో విచారణ జరిపి నీరు తగ్గిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.  

Medigadda Barrage-TS govt, L&T begin probe: మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కొన్ని స్తంభాలు కొన్ని అడుగుల మేర మునిగి నిర్మాణానికి ముప్పు వాటిల్లిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ విచారణ చేపట్టాయి. ప్రస్తుతం 10 టీఎంసీల నీరున్న రిజర్వాయర్‌ను అధికారులు ఖాళీ చేస్తున్నారు. మల్టీ రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 16 టీఎంసీలు. "రాష్ట్ర అధికారులతో కలిసి నష్టం కారణాన్ని అంచనా వేయడానికి మా సాంకేతిక నిపుణుల బృందం ఇప్పటికే ప్రాజెక్ట్ సైట్‌కు పంపబడింది" అని ఎల్ అండ్ టీ ప్రతినిధి ఒక‌రు తెలిపారు. "ఎల్ అండ్ టీ నష్టం సాంకేతిక అంచనాపై నష్టాన్ని సరిదిద్దడానికి అవసరమైన చర్యను తీసుకుంటుంది. వీలైనంత త్వరగా ప్ర‌స్తుత స‌మ‌స్య‌కు పరిష్కారానికి మార్గం చూపుతుంది" అని ఆయన చెప్పారు.

"గత సంవత్సరం, ఈ బ్యారేజీకి 28.25 లక్షల క్యూసెక్కుల డిజైన్ డిశ్చార్జికి వ్యతిరేకంగా అత్యధికంగా 28.70 లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. బ్యారేజీ డిజైన్‌ను రాష్ట్ర అధికారులు ఇచ్చారు. బ్యారేజీ సురక్షితంగా పనిచేయడం కొనసాగించింది. జూలై 2022 నాటి భారీ వరదలను కూడా తట్టుకుంది" అని ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. "రిజర్వాయర్‌ను ఖాళీ చేసిన తర్వాత మాత్రమే మేము దానిని స‌మ‌స్య‌ను ప‌రిష్కారం చేయగలము. దీనికి రెండు రోజులు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వ డ్యామ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ బృందం కూడా రిజర్వాయర్ స్థలాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేయడానికి, దానిని సరిదిద్దడానికి చర్యలను సూచిస్తుంది" అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదిలావుండ‌గా, ఇప్ప‌టికే కేంద్ర జ‌ల సంఘం నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేయ‌గా, మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 144 సెక్షన్ విధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ట్రాఫిక్ కోసం బ్యారేజీని మూసివేసిన పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్) ప్రారంభ స్థానం, దీనిని ఎల్ అండ్ టి నిర్మించింది. దీనిని జూన్ 2019 లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రారంభించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే