ఉద్యోగులు, పెన్షనర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త, డీఏ పెంపు.. ఎంతంటే..?

Siva Kodati |  
Published : Jun 19, 2023, 10:12 PM IST
ఉద్యోగులు, పెన్షనర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త, డీఏ పెంపు.. ఎంతంటే..?

సారాంశం

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతున్నట్లు  కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా డీఏ పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతున్నట్లు తెలిపింది. కనీస వేతనం , పెన్షన్‌పై 2.73 శాతం డీఏ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో పెన్షనర్లతో పాటు 7.28 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. జూన్ నెల వేతనంతో పాటు పెంచిన డీఏను చెల్లిస్తామని ప్రభుత్వం తన ఉత్వర్వుల్లో తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్