కృష్ణా నీటిని 50:50 నిష్పత్తిలో కేటాయించాలి: కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

Published : Jul 29, 2021, 03:22 PM IST
కృష్ణా నీటిని 50:50 నిష్పత్తిలో కేటాయించాలి: కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

సారాంశం

కృష్ణా నదిలో నీటిని 50:50 నిష్పత్తిలో  ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకి కేటాయించాలని  తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. ఈ మేరక తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ గురువారం నాడు లేఖ రాశారు.

హైదరాబాద్: కృష్ణా నీటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ కేఆర్ఎంబీ లేఖ రాశారు.కృష్ణా బేసిన్ లో నీటిని ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీరిన తర్వాతే బేసిన్ అవతలికి తరలించాలని ఆ లేఖలో కోరారు. ఏపీ ప్రభుత్వం బేసిన్ పరిధి దాటి నీటిని మళ్లిస్తోందని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. త్రిసభ్యకమిటీ ఆమోదం లేకుండానే పోతిరెడ్డి పాడు నుండి నీటి తరలింపును అనుమతించొద్దని ఆయన కోరారు.

2021-22 నుండి  కృష్ణా నీటిని 50: 50 నిష్పత్తిలో పంచాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో  వరద ఉన్నందున విద్యుత్  ఉత్పత్తి చేసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన ఈ డిమాండ్ పై ఏపీ అభ్యంతరం చెబుతోంది. గతంలో కుదిరిన ఒప్పందం మేరకే నీటిని వాడుకోవాలని ఏపీ ప్రభుత్వం చెబుతుంది.

PREV
click me!

Recommended Stories

సీఎం రేవంత్ రెడ్డి ఫిట్ నెస్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే | CM Revanth Reddy Playing Football
రెడ్ క‌ల‌ర్ డ్ర‌స్‌లో ఉన్న ఈ అమ్మాయి స్టూడెంట్ అనుకుంటున్నారా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే ...