ఏసీబీ కేసు:మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా నలుగురి సస్పెన్షన్

Published : Sep 16, 2020, 04:31 PM IST
ఏసీబీ కేసు:మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా నలుగురి సస్పెన్షన్

సారాంశం

ఎన్ఓసీ జారీ చేయడానికి లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన నలుగురు రెవిన్యూ అధికారులపై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది.  


హైదరాబాద్: ఎన్ఓసీ జారీ చేయడానికి లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన నలుగురు రెవిన్యూ అధికారులపై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది.
మెదక్ జిల్లాలోని చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ‌ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేశాడు అడిషనల్ కలెక్టర్ నగేష్. ఈ విషయంలో రూ. 40 లక్షలు లంచం తీసుకొంటూ నగేష్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 

also read:రూ. 40 లక్షల లంచం కేసు: తెరపైకి మాజీ కలెక్టర్ పాత్ర, ఏసీబీ విచారణ

ఈ కేసులో ఆర్డీఓ అరుణారెడ్డి, తహాసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ అహ్మద్ ను  ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈ నలుగురు అధికారులు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ లో ఉన్న ఈ నలుగురిని కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ కేసులో ఈ నెల 9వ తేదీన నగేష్ సహా నలుగురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీ ద్వారా లంచం డబ్బులను తీసుకొంటున్నట్టుగా ఏసీబీ గుర్తించింది.

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌