రెవిన్యూ రాబడుల్లో 50 శాతం వేతనాలు, వడ్డీలకే: అసెంబ్లీలో కాగ్ రిపోర్టు పెట్టిన ప్రభుత్వం

Published : Aug 06, 2023, 12:13 PM IST
రెవిన్యూ రాబడుల్లో  50 శాతం  వేతనాలు, వడ్డీలకే: అసెంబ్లీలో  కాగ్ రిపోర్టు  పెట్టిన  ప్రభుత్వం

సారాంశం

కాగ్ నివేదికను  తెలంగాణ ప్రభుత్వం  ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ రాబడుల్లో 50 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నారని  కాగ్ తెలిపింది. 2021-22 ఆర్ధిక సంవత్సరం అకౌంట్స్ పై కాగ్ నివేదికను ప్రభుత్వం  ఆదివారంనాడు  ప్రవేశ పెట్టింది.
11 గ్రాంట్లకు  రూ. 75 వేల కోట్లు అధికంగా  ప్రభుత్వం  వ్యయం చేసిందని కాగ్ తెలిపింది. నీటిపారుదల, వైద్య, ఆరోగ్య, పంచాయితీరాజ్ శాఖలకు  34 శాతం అధికంగా ఖర్చు  చేసినట్టుగా కాగ్ నివేదిక ప్రకటించింది. 

గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖలకు కేటాయింపుల కంటే తక్కువగా ఖర్చు చేసినట్టుగా కాగ్  తెలిపింది. 289 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ వినియోగించినట్టుగా  కాగ్  ప్రకటించింది. 100 రోజుల పాటు రూ. 22, 669  కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ నకు   ప్రభుత్వం వెళ్లిందని  కాగ్  తెలిపింది.  2020-21 లో రూ. 9,335  కోట్ల రెవిన్యూ లోటుకు రాష్ట్రం వెళ్లిన విషయాన్ని కాగ్  అభిప్రాయపడింది.
 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu