గుడ్‌‌న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ మరోసారి గడువు పొడిగించిన తెలంగాణ సర్కార్

By narsimha lodeFirst Published Jan 31, 2024, 4:57 PM IST
Highlights


వాహనాల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును మరోసారి తెలంగాణ ప్రభుత్వం  పొడిగించింది.

హైదరాబాద్: వాహనాల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును మరోసారి తెలంగాణ ప్రభుత్వం  పొడిగించింది.ఈ మేరకు  బుధవారం నాడు రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.  ఈ ఏడాది ఫిబ్రవరి  15 వ తేదీ వరకు  పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు  ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.  ఇప్పటికే  ఒక్కసారి  గడువును పొడిగించింది.ఇవాళ్టితో గడువు ముగియనుంది. దీంతో  గడువును వచ్చే నెల  15వ తేదీ వరకు  పెంచింది  సర్కార్. 

also read:గుడ్‌‌న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు

2023  డిసెంబర్  26వ తేదీన  పెండింగ్ చలాన్లపై రాయితీని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.  2024 జనవరి 10వ తేదీన  గడువును ఇచ్చింది. అయితే ఈ నెల  10వ తేదీన  తొలిసారి గడువును పెంచింది.  ఇవాళ్టి వరకు  గడువును పొడిగించింది.  అయితే ఇవాళ  గడువును మరోసారి పెంచుతూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ద్విచక్రవాహనాలు, మూడు చక్రాల వాహనాలపై  80 శాతం, కార్లపై  50 శాతం , హెవీ వెహికిల్స్ పై 60 శాతం రాయితీ ప్రకటించింది.  2022లో  పెండింగ్ చలాన్ల ద్వారా  ప్రభుత్వానికి రూ. 300 కోట్ల ఆదాయం వచ్చింది.  ఈ నెల  10వ తేదీ నాటికి  రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 107 కోట్ల ఆదాయం లభించింది.  
 

click me!