Breaking News : నిర్మల్ లో కర్రలతో దాడి చేసుకున్న బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తలు

Published : Nov 28, 2023, 12:14 PM IST
Breaking News : నిర్మల్ లో కర్రలతో దాడి చేసుకున్న బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తలు

సారాంశం

నిర్మల్ వైఎస్సార్ కాలనీలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. 

నిర్మల్ : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ లో రెండు పార్టీల మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిర్మల్ వైఎస్సార్ కాలనీలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. తాము ప్రచారం చేస్తుండగా బిజెపి నాయకులు వచ్చారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Konda Surekha: నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అదిష్టానం ఇష్టం.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
Rain Alert: తెలంగాణలో వింత పరిస్థితి.. ఉదయం ఎండ రాత్రి వర్షం. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్