తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు వారణాసిలో రెండు రోజులు పర్యటించనున్నారు. వీరితో పాటు వీరి కుటుంబసభ్యులు ఈ పర్యటనలో పాల్గొంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు వారణాసిలో రెండు రోజులు పర్యటించనున్నారు. వీరితో పాటు వీరి కుటుంబసభ్యులు ఈ పర్యటనలో పాల్గొంటారు.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని కాశీవిశ్వేశ్వరుని దర్శనార్థం వీరు బయలుదేరారు. నేడు, రేపు రెండు రోజుల వీరు కాశీలో పర్యటించనున్నారు.
మొదటి రోజైన ఈ రోజు ముందుగా అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బొట్లో ప్రయాణం చేస్తారు. దశాశ్వమేధ ఘాట్ లో గంగా పూజ చేసి, గంగా ఆర్తి దర్శించుకుంటారు. ఆ తరువాత అస్సి ఘాట్ కు బోట్లో తిరుగు ప్రయాణం.
అనంతరం సంకట్విమోచన్ దేవాలయ దర్శనం చేసుకుని, దేవుడికి పట్టు వస్త్రాల సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు.