రైతాంగానికి కేసీఆర్ శుభవార్త.. యాసంగి ధాన్యం కొనుగోలుకు సీఎం ఆదేశాలు

Siva Kodati |  
Published : Apr 09, 2023, 08:49 PM IST
రైతాంగానికి కేసీఆర్ శుభవార్త.. యాసంగి ధాన్యం కొనుగోలుకు సీఎం ఆదేశాలు

సారాంశం

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి యేటా 7 వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్టవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని సీఎస్ శాంతికుమారికి ముఖ్యమంత్రి సూచించారు. దీంతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి యేటా 7 వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం దీనికి సంబంధించిన నగదును కూడా రైతుల ఖాతాలోనే జమ చేస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం