తెలంగాణ విద్యాశాఖలో సర్క్యులర్ కలకలం: ఐఎఎస్‌పై బదిలీ వేటు

Published : Feb 19, 2020, 11:49 AM ISTUpdated : Feb 19, 2020, 11:55 AM IST
తెలంగాణ విద్యాశాఖలో సర్క్యులర్ కలకలం: ఐఎఎస్‌పై బదిలీ వేటు

సారాంశం

తెలంగాణ విద్యాశాఖలో  సర్క్యలర్ వివాదాస్పదంగా మారింది. ఈ విషయం తెలుసుకొన్న సీఎం కేసీఆర్  ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈ కారణంగానే ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు పడింది.

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ సర్క్యులర్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.  సీఎం, సీఎస్‌కు సమాచారం లేకుండానే ఈ సర్క్యులర్ జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Also read:పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించకపోతే పదవుల్లో నుండి తొలగాలి: కేసీఆర్ వార్నింగ్

వచ్చే ఏడాది జనవరి నుండి మార్చి 15వ తేదీ వరకు  ఎలాంటి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించకూడదని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సర్క్యులర్ వచ్చింది. పాఠశాల డిప్యూటీ సెక్రటరీ నుండి  ఈ ఉత్తర్వులు అందాయి. అయితే ఈ ఉత్తర్వుల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఎన్‌పీఆర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  ఈ తరుణంలో ఎన్‌పీఆర్, జనాభా లెక్కల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా వచ్చే ఏడాది జనవరి నుండి  మార్చి 15 వరకు ఎలాంటి పరీక్షల షెడ్యూల్‌ను పెట్టుకోవద్దని  ఈ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా టీఆర్ఎస్  వ్యవహరిస్తోంది.  సీఏఏ, ఎన్‌ఆర్‌సీ విషయంలో పార్లమెంట్‌లో కూడ  టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు చేసింది. ఈ తరుణంలో  విద్యాశాఖలో జారీ చేసిన ఈ సర్క్యులర్ వివాదస్పదంగా మారింది.

సీఎం , సీఎస్‌కు సమాచారం లేకుండానే ఈ ఉత్తర్వులు  జారీ అయ్యాయని చెబుతున్నారు. ఈ విషయం సీఎం దృష్టికి రావడంతో ఓ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు వేశారు.  మరికొందరు అధికారులపై సీరియస్ అయినట్టుగా సమాచారం. 


 


 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu