సిద్ధిపేటలో ఎయిర్‌పోర్ట్ : హర్దీప్ సింగ్ పూరికి కేసీఆర్ వినతి

By Siva KodatiFirst Published Dec 12, 2020, 4:30 PM IST
Highlights

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులను వరుస పెట్టి ఆయన కలుస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చలు జరుపుతున్నారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులను వరుస పెట్టి ఆయన కలుస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చలు జరుపుతున్నారు.

ఈ క్రమంలో శనివారం కేసీఆర్ కేంద్ర పౌరవిమానయాన శాఖ, హౌసింగ్ మరియు పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు.

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించినందుకు హర్దీప్ సింగ్‌కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణలోని సిద్ధిపేట, వరంగల్ లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు, పలు విషయాలపై ఇద్దరు నేతలు చర్చించారు. 

click me!