గాంధీ సిద్దాంతాలు నేటి యువతకు ఆదర్శం: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ప్రారంభించిన కేసీఆర్

Published : Mar 12, 2021, 11:33 AM IST
గాంధీ సిద్దాంతాలు నేటి యువతకు ఆదర్శం: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ప్రారంభించిన కేసీఆర్

సారాంశం

గాంధీ సిద్దాంతాలు నేటీ యువతకు ఆదర్శమని తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు.   

హైదరాబాద్:గాంధీ సిద్దాంతాలు నేటీ యువతకు ఆదర్శమని తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు. 

శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

అహింసా పద్దతిలోనే స్వాతంత్ర్యం సాధించడం చాలా  గొప్ప  అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. .మార్టిన్ లూథర్ కింగ్ కు కూడా గాంధీనే ఆదర్శమని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.ప్రపంచానికే పాఠం నేర్పింది మన స్వాతంత్ర్య పోరాటమని ఆయన గుర్తు చేశారు.స్వాతంత్ర్య ఉద్యమానికి మహాత్ముడు నేతృత్వం వహించాక చాలా మార్పులు వచ్చాయన్నారు.

స్వాతంత్ర్య ఉద్యమం సందర్భంగా సాగిన పోరాటాలను ఈ తరం యువతకు తెలిపేందుకు వీలుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు గాను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా సీఎం ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?