గాంధీ సిద్దాంతాలు నేటి యువతకు ఆదర్శం: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ప్రారంభించిన కేసీఆర్

Published : Mar 12, 2021, 11:33 AM IST
గాంధీ సిద్దాంతాలు నేటి యువతకు ఆదర్శం: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ప్రారంభించిన కేసీఆర్

సారాంశం

గాంధీ సిద్దాంతాలు నేటీ యువతకు ఆదర్శమని తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు.   

హైదరాబాద్:గాంధీ సిద్దాంతాలు నేటీ యువతకు ఆదర్శమని తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు. 

శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

అహింసా పద్దతిలోనే స్వాతంత్ర్యం సాధించడం చాలా  గొప్ప  అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. .మార్టిన్ లూథర్ కింగ్ కు కూడా గాంధీనే ఆదర్శమని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.ప్రపంచానికే పాఠం నేర్పింది మన స్వాతంత్ర్య పోరాటమని ఆయన గుర్తు చేశారు.స్వాతంత్ర్య ఉద్యమానికి మహాత్ముడు నేతృత్వం వహించాక చాలా మార్పులు వచ్చాయన్నారు.

స్వాతంత్ర్య ఉద్యమం సందర్భంగా సాగిన పోరాటాలను ఈ తరం యువతకు తెలిపేందుకు వీలుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు గాను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా సీఎం ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్