దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్: ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఆల్ పార్టీ మీటింగ్

Published : Jun 27, 2021, 12:47 PM IST
దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్: ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఆల్ పార్టీ మీటింగ్

సారాంశం

 సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం విధి విధానాల రూపకల్పన కోసం అఖిలపక్షాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు. ప్రధాన పార్టీలకు చెందిన  దళిత సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది.   

 సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం విధి విధానాల రూపకల్పన కోసం అఖిలపక్షాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు. ప్రధాన పార్టీలకు చెందిన  దళిత సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది. 

పార్టీలతో సంబంధం లేకుండా దళిత నేతలను కూడ  ఈ సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. వీరిలో ఎక్కువగా మాజీ ఎమ్మెల్యేలున్నారు. అసెంబ్లీలో ఆయా శాసనసభపక్ష నేతలతో పాటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ ఎంపీలు మంద జగన్నాథం, మాజీ మంత్రులు మోత్కుపల్ని నర్సింహ్ములు, ప్రసాద్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఎస్సీ సబ్‌ ప్లాన్‌తో సంబంధం లేకుండా ఈ పథకానికి ప్రత్యేకంగానే నిధులు ఖర్చు చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని, ఆదివారం నిర్వహించనున్న (అఖిలపక్ష) సమావేశంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  
 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !