టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోంది.. జనం చూపు బీజేపీ వైపే: లక్ష్మణ్

sivanagaprasad kodati |  
Published : Oct 08, 2018, 02:02 PM IST
టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోంది.. జనం చూపు బీజేపీ వైపే: లక్ష్మణ్

సారాంశం

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ నెల 10న కరీంనగర్‌లో జరగనున్న అమిత్ షా సభ ఏర్పాట్లపై బీజేపీ నేతలు సమావేశమయ్యారు. 

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ నెల 10న కరీంనగర్‌లో జరగనున్న అమిత్ షా సభ ఏర్పాట్లపై బీజేపీ నేతలు సమావేశమయ్యారు.

అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన ప్రగతి నివేదన సభకు 20 లక్షల మంది వస్తారని అనుకుంటే.. పట్టుమని నాలుగు లక్షల మంది కూడా రాలేదని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ విధానాల పట్ల ప్రజలు విసుగుచెందారని అందుకు తగ్గట్టుగానే ఓపినీయన్ పోల్స్‌లో బీజేపీకి బ్రహ్మరథం కట్టారని లక్ష్మణ్ అన్నారు.

ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై కేసీఆర్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదన్నారు. ముందస్తు ఎన్నికల వల్ల రాష్ట్రంలో పాలన కుంటుపడిందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. బీజేపీ సమర భేరీకి ప్రజలు భారీగా తరలి రావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu