సీఏఏకు అనుకూలంగా పతంగులు ఎగురవేసిన తెలంగాణ బీజేపీ

Siva Kodati |  
Published : Jan 14, 2020, 05:11 PM IST
సీఏఏకు అనుకూలంగా పతంగులు ఎగురవేసిన తెలంగాణ బీజేపీ

సారాంశం

పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా తెలంగాణ బీజేపీ గాలిపటాలు ఎగురవేసింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సీఏఏ బిల్లుకు అనుకూలమంటూ రాసిన పతంగులను ఎగురవేశారు

పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా తెలంగాణ బీజేపీ గాలిపటాలు ఎగురవేసింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సీఏఏ బిల్లుకు అనుకూలమంటూ రాసిన పతంగులను ఎగురవేశారు.

అటు తెలంగాణ భవన్‌లో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పతంగులు ఎగురవేశారు. 

రంగురంగుల పతంగులతో టీఆర్ఎస్ కార్యాలయాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?