పదో తరగతి పేపర్ లీకేజ్ కేసు : ఎ1గా బండి సంజయ్, మిగతా నిందితులు వీరే

Siva Kodati |  
Published : Apr 05, 2023, 05:20 PM ISTUpdated : Apr 05, 2023, 05:29 PM IST
పదో తరగతి పేపర్ లీకేజ్ కేసు : ఎ1గా బండి సంజయ్, మిగతా నిందితులు వీరే

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలంగాణ టెన్త్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఏ1గా చేర్చారు పోలీసులు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలంగాణ టెన్త్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఏ1గా చేర్చారు పోలీసులు

ఇక మిగతా తొమ్మిది మంది నిందితులు వీరే....

ఏ2 బూర ప్రశాంత్
ఏ3 మహేష్
ఏ4 మైనర్ బాలుగు
ఏ5 మోతం శివగణేష్
ఏ6 పోగు సుభాష్
ఏ7 పోగు శశాంక్
ఏ8 దూలం శ్రీకాంత్
ఏ9 పెరుమాండ్ల శార్మిక్
ఏ10 పోతబోయిన వసంత్

కాగా.. టెన్త్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌ను ఖండిస్తూ బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర పెద్దలు పరిస్ధితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశాయి. ఈ సందర్భంగా ఆయనకు ప్రివిలైజ్ నోటీసు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్  అరెస్ట్ పై దాఖలైన పిటిషన్‌ను రేపు  ఉదయం  విచారించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు  తెలిపింది. బీజేపీ  నేత  సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ ను ఇవాళ తెలంగాణ హైకోర్టులో దాఖలు  చేశారు.   

Also Read: కరీంనగర్‌ పోలీసు స్టేషన్‌లో బండి సంజయ్‌పై కేసు నమోదు.. వివరాలు ఇవే..

ఇదిలావుండగా..  తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసుకు సంబంధించి టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌‌ను అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. బండి సంజయ్‌ను ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 420, సెక్షన్ 6 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ కేసులో నిందితునిగా ప్రశాంత్.. బండి  సంజయ్‌ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను పోలీసులు రిట్రీవ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రశాంత్ నుంచి బండి సంజయ్‌కు పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. పేపర్ లీక్ జరగడానికి ముందు రోజు బండి సంజయ్‌తో ప్రశాంత్ ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అలాగే మంగళవారం రోజున బండి సంజయ్‌ను పేపర్ పంపిన తర్వాత కూడా ప్రశాంత్ ఆయన‌తో మాట్లాడినట్టుగా గుర్తించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: అప్పుడు కొన‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.? ఈ గ్రామాలు త్వ‌ర‌లోనే మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం
మీరు ఎంత ఎగిరినా... ఈసారి కేసీఆరే సీఎం | Ravula Sridhar Reddy on Revanth Reddy | Asianet News Telugu