Telangana Assembly elections 2023: కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైంది: వైఎస్ షర్మిల..

Published : Sep 01, 2023, 02:58 AM IST
Telangana Assembly elections 2023: కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైంది: వైఎస్ షర్మిల..

సారాంశం

Hyderabad: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని వైఎస్ ష‌ర్మిల తెలిపారు. “నేను ఈ రోజు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిశాను. చాలా నిర్మాణాత్మక చర్చ జరిగింది. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాను. మీకు ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, తెలంగాణ సీఎం కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైంది’’ అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు.  

YSRTP chief YS Sharmila: ఈ ఏడాది చివ‌ర‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమె కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌ను క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. వీరితో భేటీ త‌ర్వాత వైఎస్ ష‌ర్మిల మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయ‌కుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమైన అనంతరం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు.  ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని వైఎస్ ష‌ర్మిల తెలిపారు. “నేను ఈ రోజు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిశాను. చాలా నిర్మాణాత్మక చర్చ జరిగింది. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాను. మీకు ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, తెలంగాణ సీఎం కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైంది’’ అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు.

సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ తెలంగాణలోని రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనమయ్యే అవకాశాల చుట్టూనే సాగినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల కోసం రాజ‌కీయా పార్టీల మ‌ధ్య‌ యుద్ధం వేడెక్కుతున్న తరుణంలో, 26 మంది సభ్యుల ప్రతిపక్ష కూటమి 'ఇండియా'  ముంబ‌యిలో మూడవ సమావేశం జ‌రుగుతోంది. బెంగళూరులో తమ చివరి స‌మావేశంలో చ‌ర్చిన ఇత‌ర అంశాల ముందుకు తీసుకెళ్ల‌డం స‌హా ప‌లు విష‌యాలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)కి వ్యతిరేకంగా విస్తృత రోడ్‌మ్యాప్‌ను రూపొందించడం ముఖ్యాంశంగా ఉంది.

కూటమిలోని భాగస్వామ్య నాయకుల మధ్య చర్చ తదుపరి సార్వత్రిక ఎన్నికల కోసం యుద్ధ ప్రణాళిక, సీట్ల షేరింగ్ ఫార్ములాపై కేంద్రీకృతమై ఉండగా, రెండు రోజుల సమావేశంలో ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూడా దాని లోగోను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇండియా నేతలు అనధికారికంగా సెప్టెంబర్ 1న కూడా సమావేశం కానున్నార‌ని స‌మాచారం. ప్రతిపక్ష కూటమి ప్రారంభ సమావేశాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేయగా, మూడవ సమావేశాన్ని మహా వికాస్ అఘాడి (MVA), మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (UBT), నేషనలిస్ట్ కాంగ్రెస్‌లతో కూడిన ప్రతిపక్ష కూటమి నిర్వహిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Fog Alert : అధికపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాగ్ సైక్లోన్ కొనసాగుతోందా..? ఈ 12 జిల్లాలకు హైఅలర్ట్
Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu