మహిళా సంఘాల వీవోఏలకు సీఎం రాఖీ పండుగ కానుక.. జీతాలు పెంచుతూ నిర్ణయం

Published : Aug 31, 2023, 10:24 PM IST
మహిళా సంఘాల వీవోఏలకు సీఎం రాఖీ పండుగ కానుక.. జీతాలు పెంచుతూ నిర్ణయం

సారాంశం

మహిళా సంఘా వీవోఏలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా వారికి జీతం పెంచుతూ కానుక అందించారు. వచ్చే నెల నుంచి వారికి రూ. 8000 జీతాలు అందనున్నాయి.  

హైదరాబాద్: రక్షా బంధన్ కానుకగా సీఎం కేసీఆర్ మహిళా సంఘాల వీవోఏలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి భరోసా నిలిస్తూ జీతాలను పెంచారు. ఈ పెంచిన వాటితో ఇప్పుడు వీవోఏలకు (మహిళా సంఘాల సహాయలకు) నెలకు రూ. 8000 వరకు జీతాలు అందనున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సెప్టెంబర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. 

అంతేకాదు, యూనిఫాం కోసం నిధులు అందించాలని, మూడు నెలలకు ఒకసారి రెనివల్ విధానాన్ని ఏడాదికి పెంచాలని, జీవిత బీమా అమలు చేయాలనే విజ్ఞప్తులకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పదించారు. యూనిఫాం కోసం ఏడాదికి రూ. 2 కోట్ల నిధులు అందించాలని, రెనివల్ విధానాన్ని ఏడాదికి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని మంత్రి దయాకర్ రావున సీఎం ఆదేశించారు. మహిళా సంఘాలతో సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించాలని హరీశ్ రావును ఆదేశించారు.

Also Read: ఖాజాగూడలో కొత్తరాతియుగపు ఆనవాళ్లు.. 6000 ఏళ్ల కిందటి ఆనవాళ్ల గుర్తింపు

ఈ నిర్ణయంపై మహిళా సంఘాల సహాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు