కొండగట్టు కొచ్చిన పవన్ కల్యాణ్ కు పది ప్రశ్నలు

First Published Jan 22, 2018, 3:19 PM IST
Highlights

పవన్ కల్యాణ్ మాట్లాడని విషయాలెన్నో ఉన్నాయి

కొండగట్టులో ఆంజనేయ స్వామికి పూజలు చేసి జనసేన పండగ చేసుకుంటున్న  పార్టీ అధినేత వపన్ కల్యాణ్ కు  ప్రజా తెలంగాణ నేత పంజుగుల శ్రీశైల్ రెడ్డి పది ప్రశ్నలు సంధించారు.

తెలంగాణ వచ్చినందుకు పది రోజులు తిండి మానేసిన పవన్  ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే, తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతారని ఆయన హెచ్చరించారు. శ్రీశైల్ రెడ్డి వేసిన పది ప్రశ్నలు ఇవే:

*మల్లన్నసాగర్ ఏడవుందో తెలుసా నీకు, అక్కడి   పోకుండ కొండగట్టుకు పోవుడు ఎందుకు?

*ప్రభుత్వ విధానాలు బాగున్నయ్ అన్నంక ఇంక ప్రజల్లోకి ఎందుకు, ప్రజల సమస్యలు తెలుసుకొనుడు ఎందుకు?

*తెలంగాణ వచ్చిందని 12 రోజులు అన్నం మానేసినోడివి తెలంగాణ ప్రజలకు ఏం చేస్తవు?

*సింగరేణి, వేములఘాట్, గోలివాడ, వట్టెం, గౌరారం అంటే ఏమిటో తెలుసా గురించి నీకు తెలుసా?  

*పరీక్షలు పెట్టిన సంవత్సరం అయినా టీఎస్పీఎస్సీ రిజల్ట్ ఇవ్వదు, ఎపుడయిన ఈ వూసెత్తావా?


*తెలంగాణ వచ్చినంకా ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వరు. అడిగినవా ఎపుడన్నా?

*ఫూలే అంబేడ్కర్ ఫోటోలు పెట్టుకున్నవు - నేరెళ్ళ ఇసుక లారీల కింద నలిగిన దళితుల గురించి ఎపుడయినా విన్నవా?

*అక్కడేమి జరుగుతున్నదో  నీ మిత్రుడు కేటీఆర్ కు అడగ గలవా?

*తెలంగాణా లో రైతులు, నిరుద్యోగులు ఆత్మ హత్య చేసుకుంటున్న విషయం తెలుసా? ఎందుకో ఎపుడయిన కనుక్కున్నవా?

 

*పవన్... నీకు కేసీఆర్, కేటీఆర్ తో యాక్సెస్ ఉంది కదా. పైవి అన్నీ తెలుసుకుని ఈ సమస్యల పరిష్కారం కోసం పాటుపడమని సలహా ఇవ్వగలవా?

 

 

click me!