Telangana polling : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు..

By SumaBala BukkaFirst Published Dec 1, 2023, 8:57 AM IST
Highlights

అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసు నమోదయ్యింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘించడం వల్లే కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. 

బెల్లంపల్లి : తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. పార్టీ కండువాలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ కేసులు నమోదయ్యాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసు నమోదయ్యింది. ఆయన గులాబీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వచ్చారనిఆరోపణలు రావడంతో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

click me!