తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు లేఖ.. ఫేక్ అని స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు..

Published : Nov 09, 2023, 10:27 AM IST
తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు లేఖ.. ఫేక్ అని స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు..

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ లేఖ ఫేక్ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ లేఖ ఫేక్ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటూ కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు కోరినట్టు ఆయన పేరుతో ఉన్న లేఖను వైరల్ చేస్తున్నారని.. అయితే ఆ లేఖ ఫేక్ అని చెప్పారు. ఇక,  ‘‘నా తోటి కమ్మ సామాజిక వర్గ ప్రజలకు మీ చంద్రబాబు నాయుడి ముఖ్య విజ్ఞప్తి..’’ పేరుతో చంద్రబాబు రాసినట్టుగా ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అచ్చెన్నాయుడు స్పందించారు. 

ఆ లేఖ ఫేక్ అని.. తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు ఎవరికి ఎటువంటి సూచనలు చేయలేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలనే వైసీపీ కుట్రలో భాగమే ఈ దొంగ లేఖ అని విమర్శించారు. ఫేక్ లేఖతో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఒక  ప్రకటన విడుదల చేశారు.

వైసీపీ బతుకే ఫేక్ బతుకని, ఫేక్ ప్రచారాలు, ఫేక్ లేఖలనే ఆ పార్టీ నమ్ముకుందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంలో పార్టీ కార్యకర్తలకు గానీ, అభిమానులకు గానీ చంద్రబాబు ఎలాంటి సూచనలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని చంద్రబాబు లేఖ రాసినట్టుగా ఓ ఫేక్ లేఖను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని దాన్ని నమ్మవద్దని కోరారు. ఈ లేఖలో చంద్రబాబు సంతకం సైతం ఫోర్జరీ చేశారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసు శాఖకు చిత్తశుద్ది ఉంటే ప్రతిపక్ష పార్టీలు, నేతలపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే