తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రోడ్డు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన కీసర సమీపంలో ఔట్ రింగ్ రోడ్డు వద్ద జరిగింది.
మేడ్చల్ జిల్లా షామీర్ పేటలో మండలంలోని అంతయిపల్లి గ్రామంలో నూతన కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన చేసి కీసర వస్తుండగా ఔటర్ మీద ప్రమాదం జరిగింది. తలసాని ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలసానికి ఏమీ కాలేదు కానీ ఆయనతోపాటు అదే కారులో వస్తున్న మెడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్పంగా గాయాలయ్యాయి.
ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ ను అరెస్టు చేశారు.