సెకండ్ వేవ్ డేంజర్, నాలుగు వారాలు కీలకం: తెలంగాణ హైల్త్ డైరెక్టర్

Published : Apr 07, 2021, 05:51 PM IST
సెకండ్ వేవ్ డేంజర్, నాలుగు వారాలు కీలకం: తెలంగాణ హైల్త్ డైరెక్టర్

సారాంశం

తెలంగాణలో  కరోనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్  శ్రీనివాసరావు హెచ్చరించారు.


హైదరాబాద్: తెలంగాణలో  కరోనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్  శ్రీనివాసరావు హెచ్చరించారు.గతంతో పోలిస్తే సెకండ్ వేవ్ డేంజర్ గా  ఉందని ఆయన చెప్పారు. వచ్చే నాలుగు వారాలు కీలకమని ఆయన చెప్పారు. ఈ నాలుగు వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆసుపత్రుల్్లో  బెడ్స్ కూడ దొరకకపోయే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.గత కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.  రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో కూడ  సాధారణ వైద్య చికిత్సలతో పాటు కరోనా చికిత్సలు కూడ నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu