మోడీతో భేటీ.. పక్కన ఎంపీలు ఎందుకు లేరు: కేసీఆర్‌పై పొన్నాల ప్రశ్నలు

Siva Kodati |  
Published : Dec 13, 2020, 09:56 PM ISTUpdated : Dec 13, 2020, 10:03 PM IST
మోడీతో భేటీ.. పక్కన ఎంపీలు ఎందుకు లేరు: కేసీఆర్‌పై పొన్నాల ప్రశ్నలు

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రాణం బీజేపీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రాణం బీజేపీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో యుద్ధం చేస్తానన్న కేసీఆర్‌.. ప్రధాని కాళ్లపై పడ్డారని, మోడీని కలిసే సమయంలో కేసీఆర్‌ వెంట ఎంపీలు, అధికారులు లేరని ధ్వజమెత్తారు. అసలు ఆగమేఘాల మీద కేసీఆర్‌ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అని పొన్నాల ప్రశ్నించారు.

కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని లక్ష్మయ్య విమర్శించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం ఢిల్లీకి వెళ్లారనడం నాటకమని ఆయన అభివర్ణించారు.

డీపీఆర్ సమర్పించకుండా జాతీయహోదా వస్తుందా? అని పొన్నాల ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టం హామీలపై మోడీని ఎందుకు నిలదీయడం లేదని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పవర్ ఫుల్ స్పీచ్ | KCR Powerful Speech at Praja Ashirvada Sabha
KCR: నా కొడకా.. నా చావు కోరుకుంటావా? వెయ్యి జన్మలెత్తినా నన్ను ఏమీ చేయలేరు ! కేసీఆర్ మాస్ కౌంటర్