వసూళ్ల విషయమై మేళ్లచెర్వులో రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ: ఒకరికి గాయాలు

Published : Sep 27, 2022, 02:55 PM IST
వసూళ్ల విషయమై మేళ్లచెర్వులో రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ: ఒకరికి గాయాలు

సారాంశం

సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెర్వులో రెండు గ్యాంగ్ లు కర్రలతో దాడులు చేసుకున్నాయి.. ఈ ఘటనలో జోజి అనే వ్యక్తి గాయపడ్డాడు.  జోజిపై దాడి చేసిన సూర్య పారిపోయాడు. 

మేళ్లచెర్వు: సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెర్వు మండలకేంద్రంలో మంగళవారం నాడు రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వసూళ్ల విషయంలో రెండు వర్గాలు కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. జోజి అనే వ్యక్తిపై సూర్య దాడికి దిగాడు. జోజికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. జోజి, సూర్యలపై పలు కేసులున్నాయి.  నడిరోడ్డుపై ఇరు వర్గాలు కర్రలతో దాడులు చోటు చేసుకోవడంతో భయాందోళనలకు గురయ్యారు.జోజిపై దాడి చేసిన తర్వాత సూర్య పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu