సూర్యపేటలో విద్యార్థుల గర్జన

Published : Nov 07, 2016, 11:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
సూర్యపేటలో విద్యార్థుల గర్జన

సారాంశం

పీజు రీయింబర్స్ మెంట్ పై ఆందోళన కలెక్టరేట్ ను ముట్టడించిన టిజివిపి ఫర్నీచర్ ను ధ్వంసం చేసిన విద్యార్థులు    

ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలంటూ సూర్యపేట్ లో టీజీవీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వందల మంది విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టరేట్‌ను ముట్టడించడంతో ఆ ప్రాంతం అంతా రణరంగంగా మారింది. ఆందోళనకారులు పోలీసులకు తోసుకుంటూ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కలెక్టర్‌ ఛాంబర్‌లోని ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

ఈ ఘటనపై జాయింట్‌ కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులు కలెక్టర్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఆందోళనపై పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చినా... బందోబస్తు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

 

 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?